Ontimitta Kodanda Rama Templeలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఏకశిలపై సీతారామలక్ష్మణుల మూలవిరాట్లు కొలువై ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. శిల్పకళా వైభవం, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న పౌర్ణమి వెన్నెల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు.

ప్రత్యేకంగా వెన్నెల్లో జరిగే ఈ కళ్యాణం ఒంటిమిట్ట ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.దేశంలో హనుమంతుడు లేకుండా నిర్మించిన అరుదైన రామాలయంగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. రంగమండపంలోని శిల్పాలు, గోపుర నిర్మాణాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.లక్షలాదిమంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముత్యాల తలంబ్రాలు, సాంప్రదాయ కార్యక్రమాలతో కళ్యాణం అట్టహాసంగా జరగనుంది.

