పల్నాడు జిల్లాలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

March 11, 2026 12:26 PM

Palnadu districtలోని Gurazala మండలం తేలుకుట్ల గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని సుమారు 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు.అదేవిధంగా గడ్డపొలుగులు, ఇనుప పైపులు, గొడ్డళ్లు, కొడవళ్లు వంటి అనుమానాస్పద వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఆపరేషన్‌లో డీఎస్పీ ఆధ్వర్యంలో 3 మంది సీఐలు, 8 మంది ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media