జంట హత్యలు కలకలం రేపిన ఘటన Sangareddy districtలోని Patancheru పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఇంద్రేశం ప్రాంతంలోని సిటిజన్ కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్న దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతులను సోమ్లా దశరథ్ (50), మాన్యమ్మ (45)గా గుర్తించారు.ఈ దంపతులు Mahabubabad districtలోని గురుడు మండలంలోని దొంగచింత తాండకు చెందినవారని పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం ఇంద్రేశంలో వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలకు కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
