పెంచలకొన బ్రహ్మోత్సవాలపై నేడు సమీక్ష సమావేశం

April 17, 2026 10:12 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన పెంచలకొనలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

రాపూరు మండలంలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 27 నుంచి మే 3, 2026 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడానికి అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నెల్లూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది.ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించే ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు అని దేవస్థానం ఈవో కె. జనార్ధన్ రెడ్డి తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media