భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.61, డీజిల్ ధర రూ. 2.71 పెరగడంతో ఇంధన ధరలు పెరిగాయి. ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటినప్పటికీ, ధరలను యథాతథంగా ఉంచడం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరల సవరణలను కొనసాగిస్తున్నాయి. గత రెండు వారాల్లో ఇది నాలుగో ఇంధన ధరల పెంపు. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ఈ పెరుగుదల చోటుచేసుకుంది.
లీటర్ పెట్రోల్పై 2 రూపాయల 84 పైసలు, డీజిల్పై 2 రూపాయల 86 పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో పెట్రోల్ ధర 102.12 రూ, డీజిల్ ధర 95.20 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, డీజిల్ ధర 103.74 రూపాయలకు చేరింది.

