పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్ను ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
స్టేషన్ నిర్వహణ, రికార్డు నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఐజీ, మరికొన్ని రికార్డులను ఇంకా పరిశీలించాల్సి ఉందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
