PM Modi :పేలుడు బాధితులకు pm మోదీ ఓదార్పు

November 12, 2025 4:32 PM

ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని LNJP ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. వైద్యుల నుంచి వివరాలు తెలుసుకుని, అవసరమైన అన్ని సదుపాయాలు వెంటనే అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం పేలుడు కారణాలను గుర్తించేందుకు పరిశీలనలు చేపట్టింది. గాయపడిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media