అభివృద్ధి, ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందన్న ముర్ము
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధికి తెలంగాణ అందిస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు.
సోమవారం విడుదల చేసిన సందేశంలో తెలంగాణ తక్కువ కాలంలోనే వివిధ రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సమాచార సాంకేతిక రంగం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.
తెలంగాణ ప్రజల కష్టపడి పనిచేసే స్వభావం, వ్యాపార దృక్పథం రాష్ట్ర పురోగతికి బలంగా నిలిచాయని ముర్ము చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి తెలంగాణ మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్రపతి తన సందేశంలో ఆకాంక్ష వ్యక్తం చేశారు.

