రాపూరు మండల వ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ చివరి పరీక్షను పూర్తి చేశారు.
పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం తాగునీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.పరీక్షలు విజయవంతంగా ముగియడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం కనిపించిందని, అధికారుల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
