ఏపీ స్పోర్ట్స్ అకాడమీలకు దిగ్గజాల పేర్లు.. కోచ్‌ల వేతనాలు పెంపు

February 24, 2026 12:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలను ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖపట్నంలో జరిగిన 87వ శాప్ (SAAP) బోర్డు సమావేశంలో అకాడమీలకు నామకరణం చేయడంతో పాటు కోచ్‌ల వేతనాల పెంపుపై చైర్మన్ రవి నాయుడు పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు.

విశాఖపట్నం అకాడమీకి ‘కోడి రామ్మూర్తి అకాడమీ’గా నామకరణం.

కాకినాడ అకాడమీకి ‘నందమూరి తారక రామరావు (NTR) అకాడమీ’గా.

తిరుపతి అకాడమీకి ‘కరణం మల్లేశ్వరి అకాడమీ’గా.

గుంటూరు అకాడమీకి ‘ఆచార్య నాగార్జున అకాడమీ’గా పేరు ఖరారు చేశారు.

NIS డిప్లొమా కోచ్‌ల పారితోషికాన్ని రూ. 30,000కు పెంచారు. నాన్-NIS కోచ్‌లను జూనియర్ కోచ్‌లుగా గుర్తించి రూ. 21,500 వేతనం అందించాలని బోర్డు నిర్ణయించింది. 2018 నుండి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కోచ్‌ల వేతనాలను అందరికీ సమానంగా రూ. 21,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2026 ఆసియా మరియు కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు ఉన్నత స్థాయి శిక్షణ మరియు కోచింగ్ అందించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్రంలోని క్రీడాకారులకు మరియు కోచ్‌లకు మెరుగైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రవి నాయుడు స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media