Sattenapalliలో జనసేన కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు స్వాతిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ, జనసేన కౌన్సిలర్ సుమన్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
