కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే సిద్ధరామయ్య తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. తాను రాజ్యసభకు వెళ్లబోనని, రాష్ట్ర రాజకీయాల్లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని తెలిపారు.
“తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదించింది. దానికి నేను అంగీకరించాను” అని ఆయన బుధవారం ఉదయం ప్రభుత్వంలోని సీనియర్ సభ్యులతో జరిగిన అల్పాహార సమావేశంలో చెప్పారు.
ఇక సాయంత్రానికి రాజ్యసభ అంశంపైనా స్పష్టత వచ్చింది. 80 ఏళ్ల సిద్ధరామయ్యకు అధిష్ఠానం శాంతి ప్రతిపాదనగా రాజ్యసభ అవకాశం సూచించినప్పటికీ, ఆయన దాన్ని తిరస్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

