Srikakulam districtలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. Etcherla మండలం జరజాం సమీపంలో National Highway 16పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి ఆటో రిక్షాను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఢీకొట్టడంతో పలువురు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
