మాజీ ఎంపీ Kanumuru Raghu Rama Krishna Raju కేసు విచారణలో భాగంగా ఐపీఎస్ అధికారి Sunil Naik గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారి ఎస్పీ దామోదర్ ఎదుట ఆయన హాజరై వివరాలు ఇచ్చినట్లు సమాచారం.
హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించాలని సూచించడంతో సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. చట్టపరమైన విధానాల ప్రకారం మాత్రమే విచారణ కొనసాగించాలని కూడా కోర్టు సూచించింది
