‘మేనమామ బంగారు ఉంగరం’ పథకం
తమిళనాడు ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకం
తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే పసిపిల్లల కోసం కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
‘మేనమామ బంగారు ఉంగరం’ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
దీని కింద ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టే ప్రతి నవజాత శిశువుకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందజేయనున్నారు.
ఈ ఉంగరంపై ముఖ్యమంత్రి విజయ్ ముఖచిత్రంతో పాటు తమిళనాడు ప్రభుత్వ అధికారిక ముద్రను కూడా ముద్రించనున్నారు.
పథకానికి రూ.755.83 కోట్ల కేటాయింపు
ఈ పథకం అమలుకు అవసరమైన ఖర్చుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.755.83 కోట్లు కేటాయించింది.
బంగారు ఉంగరాల తయారీ కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది.
రూపాయి సర్వీస్ ఫీజుతో ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
మొత్తం పనుల్లో 70 శాతం పనులను జోయ్ ఆలూక్కాస్ సంస్థకు, మిగిలిన 30 శాతం పనులను కల్యాణ్ జ్యువెలర్స్ సంస్థకు అప్పగించినట్లు సమాచారం.
తొలి దశలో 1,28,499 ఉంగరాలు
పథకం తొలి దశలో మొత్తం 1,28,499 బంగారు ఉంగరాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వ వర్గాలు ఒప్పందాలను పూర్తి చేశాయి.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
గతంలో టీవీకే అధినేతగా ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



