Telengana కామారెడ్డి లో పెద్దపులి పంజా

December 18, 2025 10:55 AM

జిల్లాలోని పలు మండలాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా పాల్వంచ, దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో పులి వరుసగా మూగజీవాలపై దాడులు చేస్తూ హతమారుస్తుండటంతో గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
మొదట దోమకొండ మండలం అంబార్‌పేట్‌లో దూడపై దాడి చేసిన పులి, ఆపై సంగమేశ్వర్, బిక్కనూర్ మండలాల్లోనూ పశువులను చంపేసింది. తాజాగా పాల్వంచ మండలం ఇసాయిపేటలో ఒక గేదెను హతమార్చింది.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాలను పరిశీలించి పులి పాదముద్రలను సేకరించారు. పులి కదలికలను కనిపెట్టేందుకు దాడులు జరిగిన ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను అమర్చారు.
అప్రమత్తత: ఎఫ్‌డీఓ (FDO) రామకృష్ణ నేతృత్వంలో మూడు బృందాలు అడవిలోనే మకాం వేసి పులిని పర్యవేక్షిస్తున్నాయి.

వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గొర్రెల కాపరులు ఒంటరిగా వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాల్లో సర్పంచులు దండోరా వేయించి ప్రజలను హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media