Telengana :nizamabad election fever :కలెక్టర్ కఠినమైన ఆదేశాలు

November 29, 2025 3:51 PM

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎన్నికల సంఘం నియమాల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలి అని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం ఎన్నికల నిర్వహణపై పునఃశిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టబద్ధమైన ఎన్నికల నిర్వహణకు జాగ్రత్త, స్పష్టమైన అవగాహన అవసరంన్నారు. శిక్షణలో ఇచ్చే సూచనలు జాగ్రత్తగా విని పాటించాలని, ఈసీ ఇచ్చే హ్యాండ్‌బుక్‌ను అధ్యయనం చేసి విధులు నిర్వర్తించాలని సూచించారు.

నామినేషన్ ప్రక్రియను—స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ—రిటర్నింగ్ అధికారులు స్వయంగా పర్యవేక్షణలో నిర్వహించాలి అన్నారు. అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతా తెరచి, అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారానే చేయాలి అని ఈసీ నిర్దేశించినందున, ఈ వివరాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆదేశించారు.

నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ప్రతిపాదకులు వచ్చినప్పటికీ, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు అక్షర క్రమంలో, వారికి కేటాయించిన గుర్తులతో పాటు “నోటా” చిహ్నం తప్పనిసరిగా ఉండాలి అని కలెక్టర్ అన్నారు.

ఎన్నికలు పూర్తి పారదర్శకతతో, తప్పిదాలకు తావులేకుండా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆర్‌ఓలకు సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media