గుంటూరు జిల్లా Tenaliలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సి.ఐ Sambasiva Rao రౌడీ షీటర్లను హెచ్చరించారు.
స్టేషన్ పరిధిలో ఉన్న 30 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి భవిష్యత్తులో నేరాలకు పాల్పడవద్దని సూచించారు. కొందరు రౌడీ షీటర్లు స్థానికంగా దందాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు.రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తామని, మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సి.ఐ హెచ్చరించారు.
