Bachupallyలోని ప్రణవ్ ఆంటిలియా విల్లాస్లో ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. Telangana State Human Rights Commission జారీ చేసిన ఆదేశాల ప్రతులను బాధిత మహిళలు స్వీకరించారు.
వారి ప్రకారం, Hyderabad Disaster Response and Assets Protection Agency అధికారులు తమతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆ వీడియోలను అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టు చేయడంతో మహిళలపై సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ జరుగుతోందని తెలిపారు. ప్రహరీ గోడ కూల్చివేతకు తమకు అభ్యంతరం లేదని, అక్కడ ఉన్న జనరేటర్లు మరియు ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు కొంత సమయం ఇవ్వాలని మాత్రమే కోరినట్లు చెప్పారు.అయితే అధికారులు బలవంతంగా వాటిని ధ్వంసం చేశారని వారు ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తమ జీవన హక్కు, గౌరవం మరియు గోప్యత హక్కులు ఉల్లంఘించబడ్డాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి, విల్లాల లోపల వీధి దీపాలను పునరుద్ధరించాలని Greater Hyderabad Municipal Corporation కమిషనర్కు హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ చైర్పర్సన్ Justice Shameem Akhtar ఆదేశించారు.
