TG :కాళేశ్వరం క్షేత్రానికి పోటెత్తిన సాధువులు TRIVENI సంగమంలో స్నానాలు

December 15, 2025 1:05 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సాధువులు, సన్యాసుల సందడి నెలకొంది. గోదావరి ప్రదక్షిణ యాత్రలో భాగంగా దాదాపు 500 మందికి పైగా సాధువులు ఆదివారం కాళేశ్వరం చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ (యూపీ) రాష్ట్రానికి చెందిన ఈ సాధువులు గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా యానాం నుంచి కాళేశ్వరానికి చేరుకున్నారు.సాధువులు, సన్యాసులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.

ఆలయం చుట్టూ సాధువుల రాకతో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media