Khammam నగరంలో గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన విషాదం కలిగించింది. నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత బంధువుల గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫోటో దిగుతున్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ ఘటనకు సంబంధించిన విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
