ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ములుగు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో థంబి ఏవియేషన్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ సర్వీసులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) గురువారం ప్రారంభించారు.

హనుమకొండ నుండి మేడారం వెళ్లి రావడానికి (Up & Down) ఒక్కొక్కరికి రూ. 31,000 గా ధర నిర్ణయించారు. కేవలం మేడారం పరిసర ప్రాంతాలను గాలిలో వీక్షించేందుకు (Aerial View) రూ. 4,800 టికెట్ ధర ఖరారు చేశారు. ఈ హెలికాప్టర్ సేవలు నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. గత పాలకుల కంటే భిన్నంగా ప్రజా ప్రభుత్వం మేడారం అభివృద్ధి కోసం రూ. 251 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.
Booking వివరాలు: భక్తులు 9676320139, 8530004309 ఫోన్ నంబర్లు లేదా www.helitaxii.com వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
