Nalgonda districtలో దివ్యాంగులు మరియు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ B. Chandrasekhar తెలిపారు. ఈ నెల 28న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, ఇకపై ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు పాల్గొని వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను మండల స్థాయిలోనే వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
