వివాహ మండపాలు, వాణిజ్య సముదాయాల బదులు ఆలయాభివృద్ధికి నిధుల వినియోగం..
Tamilnadu: TVK ప్రభుత్వం, గత ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన రూ.245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలనా అనుమతులను రద్దు చేసింది. ఈ ప్రాజెక్టులకు ఆలయ నిధులు వినియోగించాలని గతంలో నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వివాహ మండపాలు, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి
NEET పేపర్ లీక్పై ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్
శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, రూ.115.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన 29 వివాహ మండపాల నిర్మాణ ప్రాజెక్టులు, రూ.130.08 కోట్లతో ప్రతిపాదించిన 17 వాణిజ్య సముదాయాల నిర్మాణ ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలనా అనుమతులను ఉపసంహరించింది.
ఈ ప్రాజెక్టుల్లో ఒక్కదానికి కూడా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని HR&CE శాఖ తెలిపింది. మొత్తం రూ.245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులు ఇప్పుడు అధికారికంగా రద్దయ్యాయి.
ఈ నిర్ణయానికి కోర్టులు విధించిన స్టే ఉత్తర్వులు, ఆలయాలపై పడే ఆర్థిక భారం ప్రధాన కారణాలని శాఖ వెల్లడించింది.
రద్దైన ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను ఇకపై ఆలయాలు, భక్తులకు ఉపయోగపడే కొత్త పథకాల కోసం వినియోగిస్తామని HR&CE శాఖ తెలిపింది. ఆలయ సంక్షేమం, మతపరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ TVK ప్రభుత్వం ఈ విధాన మార్పు తీసుకువచ్చిందని పేర్కొంది.


