అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగళ్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మృతురాలు హసీనా (45)గా గుర్తించారు.
మిరప కోతలకు వెళ్తున్న 13 మంది కూలీలతో ఆటో ప్రయాణిస్తుండగా, ఇసుక ట్రాక్టర్ను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మరో పదిమందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
