విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ముగింపు

March 26, 2026 12:36 PM

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న Kanaka Durga అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.

చివరి రోజు కావడంతో మరువ, మల్లె, సంపెంగ, గులాబీ, తెల్ల మరియు ఎర్ర చామంతి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారు అమృతవల్లిగా దర్శనమిచ్చారు.వైదిక ఆచారాల ప్రకారం చండీ సప్త స్తుతి పారాయణతో పాటు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరిగాయి. వసంత కాలంలో లభించే పుష్పాలతో అమ్మవారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media