సాగర తీరంలో భారత నావికా దళం అద్భుత విన్యాసాలతో అదరగొట్టింది. విశాఖలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ (IFR) వేడుకల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన విన్యాసాలను గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు తిలకించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ S. అబ్దుల్ నజీర్, CM నారా చంద్రబాబు నాయుడు, Dycm పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సముద్ర గర్భంలో భారత సైనిక సంపత్తిని, నౌకాదళ శక్తిసామర్థ్యాలను చాటేలా సాగిన ఈ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.

