కూరగాయల వ్యాన్లో తరలిస్తున్న భారీ గంజాయి సరుకును నార్కోటిక్ బృందం పట్టుకుంది. ముందస్తు సమాచారం ఆధారంగా నిఘా వేసిన పోలీసులు ఒడిశా నుంచి విజయనగరం వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని ఛేజ్ చేశారు.
ఈ ఘటన Bondapalli పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వాహనాన్ని తనిఖీ చేయగా మొత్తం 123 ప్యాకెట్లలో సుమారు 650 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ఘటనలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఛేజింగ్ సమయంలో మరికొందరు వాహనం నుంచి దిగి పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
