పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో Warangal పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ Dara Kavitha తెలిపారు.

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా Section 163 BNSS (సెక్షన్ 144) అమలు చేయనున్నట్లు వెల్లడించారు.పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 150 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో Hanamkondaలో 64, Warangalలో 47, Jangaonలో 39 కేంద్రాలు ఉన్నాయి. పరీక్షలు ఏప్రిల్ 16, 2026 వరకు ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద మూడు మందికి పైగా గుమికూడరాదు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధం. అలాగే పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
