కేజీఎఫ్ ద్వారా దేశవ్యాప్తంగా ఊహించని పాపులారిటీని సంపాదించుకున్న యష్ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన బిజీ షూటింగ్ షెడ్యూల్ నుండి సమయం కేటాయించి, క్యాన్సర్కు చికిత్స పొందుతున్న ఒక అభిమానితో మాట్లాడారు. ఆయన చేసిన ఈ మంచి పనికి ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, యష్ తన అభిమాన సంఘం శివమొగ్గ జిల్లా అధ్యక్షుడైన సునీల్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. ప్రస్తుతం క్యాన్సర్తో పోరాడుతున్న సునీల్ యోగక్షేమాలను యష్ స్వయంగా తెలుసుకున్నారు. యష్, సునీల్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కష్టకాలంలో ధైర్యం చెప్పారు. ఈ పోరాటంలో నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు అండగా ఉంటాను అని చెబుతూ ఆ నటుడు తన అభిమానికి భరోసా ఇచ్చారు.
వృత్తిపరంగా, యష్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రంలో కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా. ఈ చిత్రంలో యష్తో పాటు నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ తారాగణం ఉంది.

