YS Jagan Mohan Reddy జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని హార్బర్ను సందర్శించిన ఆయన, మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం పోర్ట్ ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిందని జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.26,000 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టామని, నాలుగు కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను 2024 మార్చి 12న ప్రారంభించామని గుర్తు చేసిన ఆయన, మత్స్యకారులకు 1,250 మెకానైజ్డ్ పడవలు అందించే ప్రణాళిక ఉందని తెలిపారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం హార్బర్ పనులను పూర్తి చేయకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు.ఇప్పటికే పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్ను ఇంకా మత్స్యకారులకు అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేదని జగన్ ప్రశ్నించారు.

