గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన అత్యంత ఆసక్తికరంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయం వరకు ఆయనకు ఏపీ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి చంద్రబాబును చూడగానే “హలో ఫ్రెండ్.. హౌ ఆర్ యూ” అంటూ గేట్స్ అప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది.అమరావతిని బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్తో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న తీరును చూసి బిల్ గేట్స్ “గ్రేట్ వర్క్” అంటూ మెచ్చుకున్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగంపై సీఎం ప్రణాళికలను ఆయన అభినందించారు.

ఆర్టీజీ సెంటర్ (RTG), డేటా లేక్, మరియు వాట్సాప్ గవర్నన్స్ పనితీరును పరిశీలించిన గేట్స్.. ప్రభుత్వ సేవల్లో ఏఐ (AI) వినియోగంపై ప్రశంసలు కురిపించారు. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో జరుగుతున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.వ్యవసాయ క్షేత్రంలో..: ప్రకృతి సాగు, డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ మరియు ‘AP-AIMS’ మొబైల్ యాప్ పనితీరును గేట్స్ స్వయంగా పరిశీలించారు. స్థానిక రైతులు అందించిన వంటకాలను ఆయన రుచి చూశారు. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రావడానికి చంద్రబాబు విజనరీ ఆలోచనలే కారణమని, నాటి ఢిల్లీ సమావేశం తనకింకా గుర్తుందని బిల్ గేట్స్ గుర్తు చేసుకున్నారు.ఏపీ ప్రభుత్వ విధానాలు పేద వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయని, చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
