రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఒడిసిలెంకవారిపల్లెకు చెందిన రేషన్ షాప్ (స్టోర్) డీలర్ టి. కృష్ణారెడ్డి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో అతికిరాతకంగా హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో నరికి ఆయన్ని ప్రాణాలను తీసినట్లు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మరియు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పగలే జరిగిన ఈ ఘోరంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
