Mancherial districtలోని Dandepalli మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు.
మృతులను మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తించారు. విద్యుత్ మెయిన్ లైన్కు ఇనుప స్టాండ్ తగలడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
