మూసీ ప్రక్షాళన అంశంపై Musi Jana Andolan Committee ప్రతినిధులు, వివిధ బస్తీలు మరియు గేటెడ్ కమ్యూనిటీల నిర్వాసితులు మాజీ మంత్రి T. Harish Raoను కలిశారు.
ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలు, విధ్వంసం వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను హరీశ్ రావుకు వివరించారు. అసెంబ్లీ వేదికగా తమ సమస్యలను ప్రస్తావించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ మూసీ బాధితులు భయపడాల్సిన అవసరం లేదని, వారి పోరాటానికి Bharat Rashtra Samithi పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలు, అక్రమ చర్యలను అసెంబ్లీలో ఎండగడతామని, బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
