యానాంలో జరిగిన BJP సమావేశంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ఇంచార్జి వేటుకురి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లడి కృష్ణారావు, బీజేపీ సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు, మోకా వెంకట సుబ్బారావు, రొక్కల సత్తెబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కే దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని నాయకులు పిలుపునిచ్చారు.
