టాలీవుడ్ దర్శకుడు Srinu Vaitla భూమి వ్యవహారంలో మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు, ఇతరులకు చెందిన వ్యవసాయ భూమిని శ్రీను వైట్లకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ డీల్లో భాగంగా శ్రీను వైట్ల సుమారు రూ.1 కోటి వరకు చెల్లించినట్లు సమాచారం. అయితే ఇటీవల కోర్టు తీర్పులో ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదని తేలింది.దీంతో తాను మోసపోయానని గుర్తించిన శ్రీను వైట్ల, ప్రస్తుతం సుమారు రూ.7 కోట్ల విలువ చేసే ఆ స్థలం విషయంలో సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
