Karimnagarలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar తన నివాసంపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PM Surya Ghar Muft Bijli Yojanaను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశమన్నారు.సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు సబ్సిడీతో పాటు 80 శాతం వరకు లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని, పేదలకు సైతం భారం లేకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.విద్యుత్ కొనుగోలు చేసే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ప్రజలు ఎదగాలని ప్రధాని Narendra Modi ఆకాంక్షగా పేర్కొన్నారు.రైతుల కోసం PM KUSUM Scheme ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయించే అవకాశముందని తెలిపారు.
