Sri Raja Rajeshwara Swamy Templeలో కోడెల మృతి ఘటన భక్తుల్లో ఆందోళన రేకెత్తించింది.సోమవారం నాడు ఆలయానికి సంబంధించిన నాలుగు కోడెలు మృతి చెందడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడె మొక్కుల ద్వారా ఆలయానికి ప్రధాన ఆదాయం వస్తుండగా, ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో గోశాలలో అదనపు సిబ్బంది, సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ మళ్లీ కోడెల మృతి చెందడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
