తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి స్నపనం వైభవంగా నిర్వహణ

April 2, 2026 10:36 AM

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో స్నపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవలో పాల్గొని స్వామివారి దర్శనం పొందారు.టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో సాగింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media