తెలంగాణలో మీసేవ ఛార్జీలు 50% పెంపు.. ప్రజలపై అదనపు భారం

April 2, 2026 2:27 PM

తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల్లో అందించే సేవలపై 50 శాతం వరకు ఛార్జీలను పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ పెంపుతో పాటు 18 శాతం జీఎస్టీ కూడా వర్తించడంతో, మొత్తం సేవల ఖర్చు దాదాపు 77-78 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.

  • కేటగిరీ-A సేవలు రూ.35 నుండి రూ.62కు పెరిగాయి
  • కేటగిరీ-B సేవలు రూ.45 నుండి రూ.80కు పెరిగాయి

కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు వంటి ముఖ్య సేవలకు ఇప్పుడు సుమారు రూ.80 వరకు చెల్లించాల్సి ఉంటుంది.అదనంగా, స్కానింగ్/ప్రింటింగ్ ఛార్జీలు కూడా పెంచి ప్రతి పేజీకి రూ.2.5గా నిర్ణయించారు.మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆపరేటర్ల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ పెంపుతో ముఖ్యంగా విద్యార్థులు, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media