జనగణన-2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ Vijaya Krishnan అధికారులకు ఆదేశించారు.
ఏప్రిల్ 16 నుంచి 30, 2026 వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇందుకు సంబంధించి https://se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు.స్వీయ గణన పూర్తిగా స్వచ్ఛందమని, నమోదు చేసిన సమాచారం సురక్షితంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
