ఇందిరా గాంధీ జూ లో విషాదం: LEO అనే సింహం మృతి

April 15, 2026 11:05 AM

మధురవాడలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల అస్సాం జూ నుంచి జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా తీసుకువచ్చిన ఏడేళ్ల మగ ఆసియాటిక్ సింహం ‘లియో’ మంగళవారం మృతి చెందింది.

అస్సాం నుంచి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉన్న ఈ సింహానికి మార్చి 19న చేసిన పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లికియోసిస్ వంటి ప్రమాదకర హీమోప్రోటోజోయన్ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధుల కారణంగా అవయవాలు క్రమంగా పనిచేయకపోవడంతో పరిస్థితి విషమించింది.నిపుణులైన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం చికిత్స అందించినప్పటికీ లియోను రక్షించలేకపోయామని జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media