Iran యుద్ధ ప్రభావంతో ఆసియా దేశాల్లో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కొరత నెలకొంది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ముడి సరుకుల సరఫరా అంతరాయం కారణంగా ప్లాస్టిక్ ధరలు పెరుగుతున్నాయి.

ఈ పరిణామంతో దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల్లో ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్కు డిమాండ్ పెరిగింది. పేపర్ ఆధారిత ట్యూబ్స్, పౌచులు వంటి ప్రత్యామ్నాయాలపై కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.ప్లాస్టిక్ బ్యాగులు, ర్యాప్ తయారీదారులు త్వరలో ధరలు 30% వరకు పెంచే అవకాశం ఉందని జపాన్ సంస్థలు పేర్కొన్నాయి. ఆసియాలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ సంక్షోభం ప్రభావం మరింతగా కనిపిస్తోంది.కొన్ని కంపెనీలు ఇప్పటికే పేపర్ ఆధారిత ప్యాకేజింగ్కు మారుతున్నప్పటికీ, మరికొన్ని సంస్థలు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం కొనసాగితే ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
