రష్యా, ఇరాన్ చమురు కొనుగోళ్లకు ఇచ్చిన మినహాయింపులను ఇకపై కొనసాగించబోమని అమెరికా ప్రకటించింది. దీంతో భారత్కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది.

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, మార్చి 11కు ముందు లోడ్ చేసిన చమురు సరఫరాలకు మాత్రమే తాత్కాలిక అనుమతులు ఇచ్చామని, ఇకపై కొత్త మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.ఈ మినహాయింపుల ద్వారా భారత్ గ్లోబల్ సరఫరా అంతరాయాల సమయంలో సుమారు 30 మిలియన్ బ్యారెల్స్ రష్యా చమురును కొనుగోలు చేసింది. ముఖ్యంగా హోర్ముజ్ సముద్ర మార్గంలో ఉద్రిక్తతల కారణంగా సరఫరా సమస్యలు తలెత్తిన వేళ ఇవి ఉపశమనం కలిగించాయి.ఇరాన్ చమురుకు సంబంధించిన మరో మినహాయింపు ఏప్రిల్ 19తో ముగియనుంది. అమెరికా “మ్యాక్సిమమ్ ప్రెషర్” విధానాన్ని కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామం గ్లోబల్ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండగా, భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
