India మరియు South Korea మధ్య ఆర్థిక సహకారం మరింత బలపడుతోంది. రెండు దేశాలు కలిసి 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రధాన మంత్రి Narendra Modiతో సమావేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు Lee Jae Myung, ఇంధనం, సెమీకండక్టర్లు, నౌకానిర్మాణం, స్టీల్, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారం విస్తరించనున్నట్లు తెలిపారు.ఇరు దేశాలు 2010లో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని పునరుద్ధరించి మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ స్థాయి ఆర్థిక సహకార కమిటీని ఏర్పాటు చేశారు.అలాగే, స్టీల్ రంగంలో భారీ పెట్టుబడులు కూడా ప్రకటించాయి. POSCO సంస్థ, భారతదేశంలోని ఒడిశాలో JSW Steelతో కలిసి భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది.ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తూ, వచ్చే దశాబ్దానికి కొత్త వృద్ధి మార్గాన్ని సృష్టించడమే ఈ ఒప్పందాల లక్ష్యంగా నాయకులు పేర్కొన్నారు.
