ముంబై లెన్స్‌కార్ట్ స్టోర్‌లో వివాదం.. బీజేపీ నేత ఆగ్రహం

April 21, 2026 2:48 PM

ముంబైలోని లెన్స్‌కార్ట్ స్టోర్‌లో బీజేపీ నేత నాజియా ఎలాహి ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. మంగళసూత్రం, తిలకం ధరించడంపై స్టోర్‌లో నిషేధం విధించారని ఆరోపిస్తూ ఆమె స్టోర్ యాజమాన్యాన్ని నిలదీశారు.

హిందూ సంప్రదాయాలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రశ్నించిన నాజియా, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొంతమంది సిబ్బందికి తిలకం దిద్ది “జై శ్రీరామ్” నినాదాలు చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుండగా, సంస్థ నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media