ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష అయిన POLYCET 2026 నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. భీమిలి పరిధిలోని Avanthi Engineering Collegeలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ పరీక్ష ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10:00 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 11:00 తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించరు.హాల్ టికెట్ లేని అభ్యర్థులు ఉదయం 7:00 నుంచి 9:00 గంటల మధ్య పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాలను సంప్రదించవచ్చు.ఇక విద్యార్థుల సౌకర్యార్థం Muttamsetti Srinivasa Rao ఆధ్వర్యంలో ఉచిత బస్సు సదుపాయం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, ఆనందపురం ప్రాంతాల నుంచి బస్సులు ఉదయం 7:30కు బయలుదేరనున్నాయి.
