హైదరాబాద్లో భూకబ్జాలను అడ్డుకునేందుకు HYDRA చర్యలు చేపట్టింది. Jubilee Hillsలో 1600 గజాల పార్క్ స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడుతూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టింది.

TV5 కార్యాలయం వెనుక ఉన్న ఈ పార్క్ స్థలాన్ని కొంతమంది తప్పుడు పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో, ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.అలాగే Dundigal మండలం దొమ్మరపోచంపల్లి గ్రామంలో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా HYDRA రక్షించింది. పలుమార్లు ఆక్రమణలకు గురైన ఈ భూమిపై జిల్లా కలెక్టర్ విజ్ఞప్తితో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని అధికారులు హెచ్చరిస్తూ, కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు
