లంచం కేసులో స్వాధీనం చేసుకున్న డబ్బును ఎలుకలు తిన్నాయని పేర్కొనడంపై Supreme Court of India ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Patna High Court వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఈ ఘటన రాష్ట్రానికి భారీ ఆదాయ నష్టం కలిగించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద దోషిగా తేలిన మహిళకు, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్ల బెంచ్ బెయిల్ మంజూరు చేస్తూ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.కరెన్సీ నోట్లను ఎలుకలు నాశనం చేశాయన్న వాదనపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
